పప్పు బాగా లేదన్న దివి.. వెక్కి వెక్కి ఏడ్చిన లాస్య..

బుధవారం, 7 అక్టోబరు 2020 (12:04 IST)
బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో రోజుకో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంటుంది. ఈ సోమవారం అది కాస్త పీక్స్‌కు వెళ్లింది. నామినేషన్ల ఘట్టం ముగిసినా.. ఆ వేడి చల్లారలేదు. దివి పప్పు బాగాలేదన్నందుకు లాస్య వెక్కి వెక్కి ఏడిస్తే, అభి, అఖిల్ మధ్య గొడవకి నన్నెందుకు లాగుతార్రా బాబోయ్ అంటూ మోనల్ ఏడ్చేసింది. మొత్తానికి హౌజ్‌లో 29వ రోజు ఏడుపులతో మొదలైంది. 
 
నోయల్ నమ్మక ద్రోహం చేశాడని చింతిస్తూ కూర్చున్నాడు అమ్మరాజశేఖర్. మాస్టరు నన్ను నమ్మండి మీరు ఎలిమినేట్ కారంటాడు నోయల్. పో.. పోరా.. పిల్లలకు చెప్పు ఈ కథలంటూ.. నోయల్‌ను తరిమేశాడు అమ్మ. అంతేకాదు, అవినాష్ ముందు నోయల్‌లా మిమిక్రీ చేసి నవ్వుకుంటూ తన బాధనంతా దిగమింగుకున్నాడు.
 
అభిజిత్, మోనల్‌ మధ్య మెమొరాండం ఆఫ్ అండర్‌ స్టాండింగ్ కుదిరింది. విషయం ఏమిటంటే..? వీళ్లిద్దరూ ఇంకెప్పుడు.. ఎవరి దగ్గర మరో వ్యక్తి ప్రస్తావన తేరంటా. అరచేతి అగ్రిమెంట్‌కు బిగ్‌బాస్‌ అసిస్టేషన్‌ కూడా వీళ్లే తీసేసుకున్నారు.
 
హౌజ్‌లో ఈ వారం కెప్టెన్సీ టాక్స్ మొదలైంది. సేఫ్ గేమ్ ఆడుతున్న అవినాష్‌ను టార్గెట్ చేసిన బిగ్‌బాస్‌ మనోడికి సీక్రెట్ టాస్క్‌ ఇచ్చాడు. కన్ఫెషన్ రూంకు పిలిచి.. చెప్పాల్సిందంతా చెప్పి పంపించేశాడు. ఎరక్కపోయి ఇరుక్కుపోయిన అవినాష్ ఏం చేశాడు.. హౌ
anchor lasya
జ్‌లో ఎలా చిచ్చుపెడుతున్నాడు..? అనేది తర్వాతి ఎపిసోడ్‌లో చూడాల్సిందే.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు