మెగాస్టార్ 150వ సినిమా ఖైదీలో నటించిన హాస్య బ్రహ్మకు సినీ ఛాన్సులు అంతగా రాకపోయినా.. తాతగా మాత్రం ప్రమోషన్ వచ్చింది. బ్రహ్మానందం కుమారుడు గౌతమ్- జోత్స్న దంపతులకు మంగళవారం మగబిడ్డ జన్మించాడు. మంగళవారం హనుమాన్ జయంతి కావడంతో పండగరోజు ఇంట్లో సంతోషం వెల్లివిరిసిందని.. మనవడి రాకతో మా ఇల్లు కలకలలాడుతుందని బ్రహ్మానందం తన ఆనందాన్ని కుటుంబసభ్యులు, బంధువులతో పంచుకొన్నాడు.
మనవడికి తాత పోలికలు ఎక్కువగా వున్నాయని సినీ జనం అంటున్నారు. పాత ఇంటికి వచ్చిన తర్వాత బ్రహ్మానందంకి బాగానే కలిసొచ్చిందని.. సన్నిహితులు చెప్తున్నారు. ఇకపోతే.. పల్లకిలో పెళ్లి కూతురు సినిమాతో హీరోగా మారాడు గౌతమ్. ప్రస్తుతం మను అనే ఫిల్మ్లో నటిస్తున్నాడు. చిత్రీకరణ దాదాపుగా పూర్తికావడంతో వచ్చే నెలలో రిలీజ్ చేసే అవకాశం వుంది. చాందిని చౌదరి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి ఫణీంద్ర దర్శకుడు. సినిమా హీరోగా అంతగా క్లిక్ కాని గౌతమ్.. తండ్రయ్యాకైనా జాతకం మారుతుందేమో చూడాలి.