అల్లు అర్జున్ హీరోయిన్ కేథరిన్ థెరీసా కోలీవుడ్లో మంచి ఆఫర్లు చేజిక్కించుకుంటోంది. పందెం కోడి సీక్వెల్లో కేథరిన్ హీరోయిన్గా ఎంపికైంది. ఈ చిత్రంలో ఆరడుగుల హీరో విశాల్ సరసన కేథరిన్ నటించనుంది. వరుసబెట్టి తమిళ చిత్రాలు చేస్తున్న కేథరిన్ని అనుకోకుండా ఈ ఛాన్స్ కొట్టేసింది. విశాల్ సినిమా కోసం ఇతర హీరోయిన్లను యూనిట్ సంప్రదించింది. అయితే హీరోయిన్లందరూ ఇతర సినిమాల్లో బిజీ బిజీగా ఉండటంతో.. కేథరిన్ని ఈ అవకాశాన్ని కైవసం చేసుకుంది.