"డేంజరస్" లెస్బియన్స్‌తో ఆర్జీవీ సరసాలు!

సోమవారం, 12 అక్టోబరు 2020 (15:42 IST)
టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజా చిత్రం "డేంజరస్". ఈ చిత్రం షూటింగ్ గోవాలో పూర్తి చేసుకుంది. ఇద్దరు లెస్బియన్స్ జీవితాల మధ్య జరిగే సంఘటనలను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. పైగా, దేశంలోనే తొలి లెస్బియన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఇదేనని దర్శకుడు చెబుతున్నాడు.
 
ఏ కంపెనీ ప్రొడక్షన్ పతాకంపై రాంగోపాల్ వర్మ స్వయంగా నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. లెస్బియన్స్ పాత్రల్లో కుర్ర హీరోయిన్లు నైనా గంగూలీ, అప్సరా రాణిలు నటించారు. వీరిద్దరూ రెచ్చిపోయి కథా పాత్రల్లో లీనమైపోయినట్టు పోస్టర్లను చూస్తుంటే తెలుస్తోంది.
 
ఎంతో మంది పోలీసులు, గ్యాంగ్‌స్టర్లతో అఫైర్లు పెట్టుకున్న ఈ ఇద్దరు లెస్బియన్స్... ఆ తర్వాత వారిని చంపేసే పాత్రల్లో జీవించారట. అయితే, ఈ చిత్రం షూటింగ్ ముగియడంతో గోవాలోని ఓ స్టార్ హోటల్‌లో చిత్రం యూనిట్ పార్టీ చేసుకుంది.
 
ముఖ్యంగా, దర్శకుడు వర్మ, హీరోయిన్లు నైనా గంగూలీ, అప్సరా రాణిలు ఈ పార్టీలో మునిగితేలినట్టు తెలుస్తోంది. ప్రధానంగా ఇద్దరు భామలతో దర్శకుడు ఆర్జీవీ సరససయ్యాటలు ఆడుతూ, ఫోటోలకు ఫోజులిచ్చారు. ఈ ఫోటోలు ఇపుడ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వాటిపై మీరూ ఓ లుక్కేయండి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు