వివాదంలో చిక్కుకున్న నయనతార -విఘ్నేశ్ దంపతులు

శనివారం, 8 జులై 2023 (12:07 IST)
స్టార్ కపుల్ నయనతార -విఘ్నేశ్ శివన్ దంపతులు మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఆస్తి వివాదానికి సంబంధించి పోలీసులు ఆశ్రయించిన విఘ్నేశ్ శివన్ బాబాయిలు నయనతార పేరును కూడా తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 
 
వివరాల్లోకి వెళితే, విఘ్నేశ్ శివన్ తండ్రి శివ కొళుదు స్వస్థలం తమిళనాడు తిరుచ్చి జిల్లాలోని లాల్‌కుడి గ్రామం. ఆయనకు ఎనిమిది మంది అన్నదమ్ముులు ఉన్నారు. 
 
శివ కొళుదు పోలీస్ ఇన్‌ఫార్మర్‌గా పని చేసేవారట. శివ కొళుదు అమ్ముకున్న ఆస్తి విషయమై తాజాగా ఆయన సోదరులు మాణిక్యం, కుంచిత పాదం పోలీసులను ఆశ్రయించారు. 
 
తమకు తెలియకుండా శివ అమ్ముకున్న ఆస్తిని కొన్న వ్యక్తికి డబ్బులు చెల్లించి తిరిగి తెచ్చుకునేందుకు సాయపడాలంటూ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు డీజీపీ ఆఫీసులో మాణిక్యం, కుంచిత పాదం ఫిర్యాదు చేశారు.
 
తమ ఫిర్యాదులో విఘ్నేశ్ శివన్, ఆయన భార్య నయనతార, విఘ్నేశ్ శివన్ తల్లి మీనా కుమారి, కూతురు ఐశ్వర్యలపైనా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు