విలక్షణ నటుడు కమల్ హాసన్ నటిస్తున్న తాజా చిత్రం 'చీకటి రాజ్యం'. తెలుగు, తమిళం అంటూ రెండు భాషల్లో రూపొందుతున్న ఈ సినిమా తమిళంలో 'తూంగావనం'గా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో కమల్ సరసన హీరోయిగా త్రిష నటిస్తుంది. ఈ చిత్రం గురించిన తాజాగా సమాచారం ఏమిటంటే... ఇందులో త్రిష పోలీసు ఆఫీసర్ పాత్రలో నటిస్తోందట.
దీంతో కాన్సెప్ట్ ప్రకారం ఈ సన్నివేశాన్ని రాత్రి వేళ్ళలోనే రూపొందించాలి. త్రిష , కిషోర్ కుమార్ ఈ సినిమాలో కీలకపాత్రలలో నటిస్తున్నారు. పోలీస్ రేస్క్యూ ఆపరేషన్లో భాగంగా సన్నివేశాలన్నీ వీరిద్దరిపై తెరకెక్కిస్తున్నారు. ఈ సన్నివేశాలతో పాటు పనిలో పనిగా కమల్, త్రిషలపై అత్యంత సన్నిహిత సన్నివేశాలను కూడా చిత్రిస్తున్నట్టు సమాచారం.