చిరంజీవి తన పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేస్తున్న వేడుకకు శనివారంనాడు బంజారాహిల్స్లోని పార్క్ హయత్లో ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. ఈ రోజు రాత్రి 8గంటలకు అతిథులు ఆహ్వానం పలుకుతున్నారు రామ్చరణ్. అందరూ బ్లాక్ కోట్, వైట్ టై కట్టుకుని.. ఫంక్షన్కు హాజరవుతున్నారు. దాదాపు 250 మందిని మాత్రమే ముఖ్యుల్ని పిలిచినట్లు చిరు సన్నిహిత వర్గాలు తెలియజేస్తున్నారు. ఇప్పటికే కొంతమంది డ్రెస్ కోడ్ను కుట్టించుకున్నారు. శుక్రవారమే దర్శకుడు వివి వినాయక్ తాను డ్రెస్ కోడ్ కుట్టించుకున్నట్లు సన్నిహితులకు తెలియజేశారు.
కాగా, ఈ ఫంక్షన్లో విందుకు జీరో కొలస్ట్రాల్ వుండేలా ఫుడ్ను ఏర్పాట్లు చేశారు. ముంబైకు చెందిన ప్రముఖ ఆర్గనైజేషన్కు ఈ ఏర్పాట్లను చూస్తుంది. రాజకీయ, సినీరంగానికి చెందిన కొద్దిమంది ప్రముఖులనే ఆహ్వానించారు. ఇప్పటికే బంజారాహిల్స్ రోడ్లన్నీ చిరంజీవి గ్లామర్ ఫొటోలను కటౌట్ల రూపంలో పెట్టేశారు. అమితాబ్, అమీర్ఖాన్, రజనీకాంత్ వస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.