శతమానం భవతి.. ఉంటుందా?లేదా? సాయిధరమ్ తేజను అనుకుంటే..?

శుక్రవారం, 19 ఫిబ్రవరి 2016 (12:07 IST)
దిల్‌రాజు తాజాగా నిర్మిస్తానని ప్రకటించిన.. శతమానం భవతి.. వుంటుందా? లేదా? అనే అనుమానం దర్శకులకు వచ్చేస్తుంది. ఆయన బేనర్‌లో నలుగురు దర్శకులకు సినిమా ఛాన్స్‌ ఇస్తున్నట్లు వెల్లడించారు. అందులో రభస దర్శకుడు కూడా వున్నాడు. మరోవైపు .. ఇవివి శిష్యుడు వేగ్నష్ సతీష్‌కూడా వున్నాడు. అయితే రోజూ ఆఫీసుకువచ్చి. వెళ్ళడం.. తన కథను తుదిమెరుగులు దిద్దడం జరుగుతుంది.
 
ఒక దశలో శతమానం భవతి చిత్రానికి.. సాయిధరమ్‌తేజ.. అనుకున్నారు. కానీ కొన్ని మార్పుల రీత్యా రాజ్‌ తరుణ్‌ వచ్చాడు. తనయితే బిజినెస్‌ అవుతుందని నిర్మాత క్లారిటీతో వున్నాడు. ఇప్పటికే రెండు హిట్లు కొట్టిన రాజ్‌తరుణ్‌‌కు ఇటీవల సినిమా దెబ్బకొట్టింది. అయితే.. అసలు సినిమా అవుతుందో లేదో.. అనే అనుమానం దర్శక టీమ్‌కు కలుగుతోంది. ఏది చేసినా.. దిల్‌రాజు. ఏదో మ్యాజిక్‌ చేసి.. చివరకు ఎవరు నచ్చితేవారే చేస్తాడు.

వెబ్దునియా పై చదవండి