స్వీయ నిర్బంధంలో బాలీవుడ్ దిగ్గజం.. గదిలో ఏకాంతంగా...

మంగళవారం, 17 మార్చి 2020 (10:34 IST)
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే వందకు పైగా కేసులు నమోదయ్యాయి. అనేక మందిని వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. ఈ నేపథ్యంలో అనేక మంది సెలెబ్రిటీలు స్వీయ నిర్బంధం విధించుకుంటున్నారు. అనేక భారీ ప్రాజెక్ట్ సునిమాల షూటింగ్‌లను వాయిదా పడుతున్నాయి. 
 
ఈ నేపథ్యంలో బాలీవుడ్ నట దిగ్గజం దిలీప్ కుమార్ కరోనా భయాల నేపథ్యంలో సెల్ఫ్ క్వారంటైన్ విధించుకున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ఆయన తెలియజేశారు. కరోనా సోకకుండా ఉండేందుకు ముందస్తు చర్యల్లో భాగంగానే స్వీయ నిర్బంధాన్ని విధించుకున్నానని ఈ సందర్భంగా దిలీప్ కుమార్ తెలిపారు. 
 
తన భార్య సైరాబాను ఎలాంటి రిస్క్ ఉండకూడదనే ముందు జాగ్రత్త చర్యగా... తనకు ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండేందుకు తనను ఏకాంత గదిలో ఉంచిందని చెప్పారు. ప్రస్తుతం దిలీప్ కుమార్ వయసు 97 సంవత్సరాలు. ఇటీవలే తీవ్ర అనారోగ్యానికి గురై కోలుకున్న విషయం తెల్సిందే. పైగా, ఈ వైరస్ వృద్ధులకు సోకితే వారు తిరిగి కోలుకోడం అసాధ్యమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీంతో ఆయన స్వీయ నిర్బంధం విధించుకున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు