యూట్యాబ్‌ను షేక్ చేస్తున్న 'ఎల్లువొచ్చి గోదారమ్మా' సాంగ్

ఆదివారం, 3 నవంబరు 2019 (09:28 IST)
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ - పూజా హెగ్డే కాంబినేషన్‌లో హరీశ్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం "గద్దలకొండ గణేశ్". ఈ చిత్రం సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇందులో గతంలో శోభన్ బాబు - శ్రీదేవి జంటగా నటించిన 'దేవత' సినిమాలోని 'ఎల్లువొచ్చి గోదారమ్మా' పాటను రీమేక్ చేశారు. 
 
అప్పట్లో చక్రవర్తి స్వరపరిచిన ఈ పాట, ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అలాంటి ఈ పాటను ఇపుడు యూట్యూబ్‌లో విడుదల చేశారు. ఈ పాటకు ఒకే ఒక్క రోజులో మిలియన్ వ్యూస్‌ను సొంతం చేసుకోవడం విశేషం. 
 
శోభన్ బాబు కెరియర్లోనే కాదు, ఆనాటి నుంచి ఈనాటి వరకూ గల ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్ జాబితాలో ఈ సాంగ్ కనిపిస్తుంది. హరీశ్ శంకర్ కలర్‌ఫుల్‌గా.. బ్యూటిఫుల్‌గా చిత్రీకరించడం, పూజా హెగ్డేను మరింత గ్లామరస్‌గా చూపించారు. మరి ఈ పాట మున్ముందు ఎన్ని రికార్డులు బ్రేక్ చేస్తుందో చూడాలి.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు