'అన్నా మోము గోదారోళ్లం.. తేడాలొస్తే నవ్వుతూ నరాలు లాగేస్తాం'...

సోమవారం, 31 జులై 2023 (14:54 IST)
విష్వక్‌సేన్ హీరోగా నటించిన తాజా చిత్రం 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'. లిరిక్ రైటర్ కృష్ణ చైతన్య దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రం... కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ఫస్టు గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. టైటిల్‌ను బట్టే ఈ సినిమా గోదావరి నేపథ్యంలో నడుస్తుందనే విషయం అర్థమైపోతోంది. ఫస్టు గ్లింప్స్ చూస్తుంటే, గోదావరి కేంద్రంగా సాగే ఇసుక మాఫియా చుట్టూ ఈ కథ నడవనుందని తెలుస్తోంది.
 
మాఫియా.. ఈ విషయంలో ముఠాల మధ్య గొడవలు ప్రధానంగా ఈ కథ కొనసాగుతుందని అనిపిస్తోంది. "అన్నా మేము గోదారోళ్లం.. మాట ఒకటే సాగదీస్తాం.. తేడాలొస్తే నవ్వుతూ నరాలు లాగేస్తాం' అంటూ విష్వక్ చెప్పిన డైలాగ్‌తో ఈ గ్లింప్స్ మొదలవుతుంది. లవ్.. యాక్షన్.. సస్పెన్స్ ప్రధానంగా ఈ గ్లింప్స్ కనిపించింది. 
 
ఇంతవరకూ బాడీ లాంగ్వేజ్ పరంగా.. డైలాగ్ డెలివరీపరంగా మాత్రమే మాస్‌గా కనిపించిన విష్వక్‌సేన్, ఈ సినిమాలో మాస్‌లుక్‌తోనే కనిపిస్తున్నాడు. కథానాయికగా నేహాశెట్టి నటించిన ఈ సినిమాలో, ఇతర ముఖ్యమైన పాత్రలలో నాజర్ .. సాయికుమార్, గోపరాజు రమణ కనిపించారు. అంజలి ఒక ప్రత్యేకమైన పాత్రను పోషించింది. నాగవంశీ - సాయిసౌజన్య నిర్మించిన ఈ సినిమాకి, యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు