హీరో హీరోయిన్స్ మీద చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి మందడి కిషోర్ రెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేయగా.. మాజీ ఎమ్మెల్యే జి.వి. ఆంజనేయులు క్లాప్ కొట్టారు. ఈ కార్యక్రమానికి టీవీ 5 మూర్తి, హనుమంతరావు, కృష్ణా రావు, గరుడవేగ అంజి, హుషారు ఫేమ్ తేజస్లు ముఖ్య అతిథులుగా విచ్చేశారు.
దర్శకత్వ బాధ్యతను మాత్రమే కాకుండా కథ, కథనం, మాటలు కూడా మారేష్ శివన్ అందించారు. రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం రెగ్యులర్ చిత్రీకరణ సెప్టెంబర్ 5 నుంచి ప్రారంభంకానుంది.
అలా నిన్ను చేరి సినిమాకు పాటలు చంద్రబోస్, సంగీతం సుభాష్ ఆనందన్ అందిస్తుండగా.. పి.జి. వింద కెమెరామెన్గా పని చేస్తున్నారు. ఆర్ట్ డైరెక్టర్గా విఠల్, క్యాస్టూమ్ డిజైనర్గా ముదసరా మహ్మద్ వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి కర్నాటి రాంబాబు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్.
ఈ చిత్రంలో దినేష్ తేజ్, హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ, శివ రామచంద్రవరపు, రంగస్థలం మహేష్ తదితరులు నటిస్తున్న
కథ, కథనం, మాటలు దర్శకత్వం : మారేష్ శివన్, నిర్మాత : కొమ్మాలపాటి సాయి సుధాకర్
సమర్ఫణ : కొమ్మాలపాటి శ్రీధర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : కర్నాటి రాంబాబు, సంగీతం : సుభాష్ ఆనందన్, కెమెరా- పి.జి. వింద, పాటలు : చంద్రబోస్.