మిర్చి, అత్తారింటికి దారేది వంటి సినిమాల్లో అత్తగా, అమ్మగా కనిపించిన నదియా కంటే హేమమాలిని భారీ మొత్తాన్ని పారితోషికంగా డిమాండ్ చేసిందని టాలీవుడ్ వర్గాల్లో వార్తలు షికార్లు చేస్తున్నాయి. నదియా రోజుకు రెండు లక్షలు తీసుకుంటుంటే హేమమాలిని శాతకర్ణిలో తన రోల్ ప్రాధాన్యత ప్రకారం రూ.2 కోట్లు డిమాండ్ చేసిందని వార్తలొస్తున్నాయి.
గౌతమీ పుత్ర శాతకర్ణిలో హేమమాలిని పాత్ర కీలకం కావడంతోనే ఆమె భారీ పారితోషికాన్ని డిమాండ్ చేసిందని.. ఈ మొత్తం ప్రస్తుతం టాలీవుడ్లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన నదియా, జయసుధ, రేవతి వంటి క్యారెక్టర్ ఆర్టిస్టుల రెమ్యునరేషన్ కంటే చాలా ఎక్కువని సినీ పండితులు అంటున్నారు. మరి హేమమాలినికి అంత మొత్తాన్ని ఇస్తారో లేదో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.