అక్కినేని ఇంట పెళ్ళి భాజాలు మోగనున్నాయి. ఏ మాయ చేసావె హీరోహీరోయిన్లు నిజజీవితంలో భార్యాభర్తలు కానున్నారు. డిసెంబరులోనే అక్కినేని వారసులు పెళ్ళి కొడుకులు కానున్నారు. అక్కినేని నాగార్జున తనయులు ఇద్దరికి డిసెంబరులోనే వివాహం కానుంది. నాగార్జున పెద్ద కుమారుడు నాగచైతన్య, సమంత.. రెండో కుమారుడు అఖిల్, ఆయన చిరకాల స్నేహితురాలు డిజైనర్ శ్రియా భూపాల్ జోడీలకు పెళ్లి కానుంది.
నాగచైతన్య, చెన్నైకి చెందిన సమంత 2010లో వచ్చిన ‘ఏ మాయ చేసావె’ చిత్రంలో కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఆపై ఈ హిట్ పెయిర్ ఆటోనగర్ సూర్య, మనం చిత్రాల్లోనూ కలిసి నటించారు. ఏ మాయ చేసావె సినిమా నుంచే ప్రేమలో పడిన వీరిద్దరూ.. ఇప్పుడిప్పుడే తమ ప్రేమాయణం గురించి ఓపెన్గా చెప్పేశారు.
దీనిపై మీడియాలో, సోషల్ మీడియాలో హాట్ హాట్గా చర్చ సాగింది. ఇద్దరూ కలిసి ఒక థియేటర్లో సినిమా చూశారంటూ నెట్లో ఫొటోలు కూడా హల్చల్ చేశాయి. కానీ సమంత, నాగచైతన్యల నుంచి అక్కినేని ఫ్యామిలీ నుంచి ఎలాంటి స్పందన రాలేదు.