ఒక్క ధోనీ సినిమానే కాదు.. ఇకపై ఏ భారతీయ సినిమాలను పాకిస్థాన్లోని థియేటర్లలో ఆడనివ్వకుండా నిషేధం విధించింది. భారత క్రికెట్ దిగ్గజం ధోనీ జీవితం ఆధారంగా తెరకెక్కిన ''ఎం.ఎస్.ధోనీ ది అన్టోల్డ్ స్టోరీ'' సినిమా సెప్టెంబర్ 30వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోపాకిస్థాన్కు చెందిన ఐఎమ్జీసీ గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ అనే సంస్థ ఈ చిత్రాన్ని ఆ దేశంలో రిలీజ్ చేయాలని నిర్ణయించింది. అయితే పాకిస్థాన్ తీసుకున్న నిర్ణయంతో సదరు సంస్థ ఈ సినిమాను విడుదల చేయడంలో వెనక్కి తగ్గింది.