కె.టి. కుంజుమోన్ నిర్మిస్తున్న జెంటిల్‌మేన్ 2లో ప్రియా లాల్

బుధవారం, 13 ఏప్రియల్ 2022 (15:37 IST)
K.T. Kunjumon, Priya Lal
మెగా నిర్మాత  కె.టి.కుంజుమోన్ మరోసారి సరికొత్తగా భారీ చిత్రాలు నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అర్జున్, మధు ప్రధాన పాత్రలలో తన నిర్మాణంలో ప్రతిష్టాత్మకంగా రూపుద్దిద్దుకొని సంచలన విజయం సాధించిన 'జెంటిల్‌మేన్' చిత్రానికి సీక్వెల్ తెరకెక్కించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
 
ఇప్పటికే ఈ సూపర్ క్రేజీ సీక్వెల్ లో కథానాయికగా నయనతార చక్రవర్తిను ఎంపిక చేశారు నిర్మాతలు. ఇప్పుడీ సీక్వెల్‌లో  నటించబోయే మరో నటి పేరుని ప్రకటించారు. తెలుగులో 'గువ్వా గోరింక' చిత్రంతో అరంగేట్రం చేసిన హీరోయిన్  ప్రియాలాల్‌ని  మరో కథానాయికగా ఖరారు చేసినట్లు చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది.  
 
మ్యూజికల్ బాహుబలి ఎంఎం కీరవాణి ఈ మెగా సీక్వెల్‌కి సంగీతం అందించనున్నారు. బ్లాక్ బస్టర్ హిట్ 'జెంటిల్‌మేన్' కి సీక్వెల్ గా రాబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు