గోవిందుడు అందరి వాడేలే తర్వాత కృష్ణ వంశీ సినిమాలో కాజల్ అగర్వాల్ నటించబోతుందని సినీ వర్గాల సమాచారం. రామ్ చరణ్ తేజ్తో గోవిందుడు అందరివాడేలే చిత్రం తీసిన కృష్ణవంశీ.. బాలయ్యతో 100వ సినిమాకి ట్రై చేశాడు కానీ వర్కవుట్ కాలేదు. మధ్యలో రుద్రాక్ష అనే ప్రాజెక్టు పట్టాలపైకి ఎక్కబోయి ఆగిపోయింది. తాజాగా మరో కొత్త సినిమాను సెట్స్పైకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాడు.
సందీప్ కిషన్ లీడ్ రోల్లో చేయబోతున్న ''నక్షత్రం'' సినిమాకు ఇంకా హీరోయిన్ ఖరారు చేయనుంది. రెజీనా కసాండ్రా - నందితా రాజ్లతో చర్చలు జరుగుతుండగా.. ఈ మూవీకి భారీ తారాగాణంతో ఆకర్షణ తీసుకురానున్నాడని తెలిసింది. కాజల్ అగర్వాల్ని టాలీవుడ్కి చందమామ సినిమా ద్వారా గుర్తింపు సంపాదించిపెట్టాడు. తాజాగా కాజల్ అగర్వాల్ను నక్షత్రంలో కూడా నటింపచేయనున్నాడని తెలుస్తోంది.