మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన లేటెస్ట్ క్రేజీ హీరో వరుణ్ తేజ్, ప్రఖ్యాత సూపర్ మోడల్ ప్రగ్యా జైస్వాల్ జంటగా నటిస్తోన్న చిత్రం 'కంచె '. ఇప్పటి వరకు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎవరూ చిత్రీకరించని రెండో ప్రపంచ యుద్ధ పోరాట సన్నివేశాలు ఈ చిత్రంలో చూపిస్తున్నారు. జార్జియా దేశంలో, రియల్ వరల్డ్ వార్ 2 వెపన్స్ , ట్యాంకులు, యూనిఫాంమ్స్, ఇతర లొకేషన్లను వాడుకుని భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
బాలీవుడ్లో ఇటివలే గబ్బర్ చిత్రంతో మంచి విజయాన్ని సాధించిన అభిరుచి గల దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం ఇది. భారీ వ్యవయంతో, అత్యుత్తమ సాంకేతిక విలువలతో రూపుదిద్దుకుంటున్నఈ చిత్రాన్ని రాజీవ్ రెడ్డి, మరియు సాయి బాబు జాగర్లమూడి సంయుక్తంగా ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై నిర్మిస్తున్నారు . ప్రముఖ బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ చిరంతాన్ భట్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చారు.