బాహుబలి హీరో, యంగ్ రెబల్ స్టార్ సరసన ఏక్ నిరంజన్ సినిమాలో నటించిన కంగనా రనౌత్ అందరికీ బాగానే గుర్తుండి ఉంటుంది. ప్రస్తుతం బాలీవుడ్లో క్వీన్గా ఓ వెలుగు వెలుగుతున్న కంగనా పారితోషికం ఏకంగా 11 కోట్ల రూపాయలకు చేరిందట. ప్రస్తుతం బాలీవుడ్లో కంగనా పారితోషికమే చర్చనీయాంశమైంది.
తను వెడ్స్ మను రిటర్న్ విడుదలైన తర్వాత కంగనా రనౌత్ పారితోషికం అమాంతంగా ఆకాశానికి చేరిపోయిందట. తాజాగా ఓ కొత్త సినిమా కోసం ఏకంగా 11 కోట్లు డిమాండ్ చేసిందట కంగనా రనౌత్. అదే విషయాన్ని అమ్మడిని అడిగితే... 'అందులో తప్పేముంది? నేను చేసే సినిమాలు, వాటికి పట్టే సమయం, బిజినెస్ బట్టే కదా నా రెమ్యూనరేషన్ ఉంటుంది' అని ఒయ్యారాలు పోతోందట.
అంతేగాకుండా తాను చేసే సినిమాలు చూసి కొంతమంది హీరోయిన్లు అసూయ పడుతున్నారని గర్వంగా చెప్తోంది. కానీ బాలీవుడ్ జనం ఏమనుకుంటున్నారంటే.. కంగనా రనౌత్ తన గురించి అతిగా ఊహించుకుంటుందా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంతేగాకుండా.. సెప్టెంబర్ 18న రాబోతున్న 'కట్టి బట్టీ' మూవీతో అమ్మడి అసలు బలం తెలిసిపోతుందిలేనని మరికొందరు అనుకుంటున్నారు. మరి ఏమవుతుందో వేచి చూడాలి.!