తెలంగాణలోని 167 పాఠశాలలను దత్తత తీసుకున్న లక్ష్మి మంచు

మంగళవారం, 25 జులై 2023 (13:52 IST)
Lakshmi Manchu
లక్ష్మి మంచు ప్రస్తుతం తన రాబోయే చిత్రం "అగ్నినక్షత్రం" పోస్ట్ ప్రొడక్షన్ ఫేజ్‌లో బిజీగా ఉన్నారు, ఇందులో మోహన్ బాబు కూడా ఉన్నారు, ఇదిలా ఉండగా,  టీచ్ ఫర్ చేంజ్ అనే NGO ద్వారా హైదరాబాద్‌లోని అనేక పాఠశాలలను లక్ష్మి మంచు దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. దీనివల్ల ఈ ప్రాంతంలోని నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. హైదరాబాద్‌లో 15, రంగారెడ్డిలో 25, యాదాద్రిలో 81, శ్రీకాకుళంలో 16, గద్వాల్‌లో 30 పాఠశాలలతో మొత్తం 167 పాఠశాలలను దత్తత తీసుకున్నారు.
 
ఈ దత్తత నుండి ప్రయోజనం పొందుతున్న విద్యార్థుల తాత్కాలిక సంఖ్య 16,497గా ఉంది. గద్వాల్‌లోని పాఠశాలల ఎంపిక ప్రక్రియ గురించి అడిగినప్పుడు, "మేము గద్వాల్‌లోని పాఠశాలలను నిర్దిష్ట ప్రమాణాల ఆధారంగా గుర్తించాము- కనీస లేదా డిజిటల్ క్లాస్‌రూమ్‌లకు ప్రాప్యత లేదు, 1 నుండి 5 తరగతుల వరకు కనీసం 50 మంది విద్యార్థులు, టీచ్ ఫర్ చేంజ్ స్మార్ట్ క్లాస్‌రూమ్ పాఠ్యాంశాలను స్వీకరించడానికి సుముఖత చుపాము అని అన్నారు. 
 
ఇంకా ఆమె ఇలా పంచుకుంది, "నేను సినిమాలు, సామిజిక బాధ్యత రెంటిని విధిగా  పనిని ఇష్టపడతాను.  నా షెడ్యూల్‌ను తదనుగుణంగా ప్లాన్ చేసుకుంటాను. నేను ఎల్లప్పుడూ నా బృందానికి అందుబాటులో ఉంటాను. ప్రముఖులతో వ్యక్తిగతంగా సమావేశాలకు హాజరవుతాను. దానికి అంకితభావంతో కూడిన బృందం ఉండటం నా అదృష్టం." అన్నారు.
 
అంతేకాకుండా, భారతదేశంలో విద్యా వ్యవస్థను మెరుగుపరచడానికి ప్రభుత్వం మరియు టీచ్ ఫర్ చేంజ్ వంటి NGOల మధ్య సహకారం యొక్క ప్రాముఖ్యతను లక్ష్మి మంచు నొక్కిచెప్పారు. "ప్రస్తుతం హాజరు తక్కువగా ఉన్న గ్రామీణ ప్రాంతాలలో ప్రభుత్వ పాఠశాలలకు హాజరు కావడానికి విద్యార్థుల ఆసక్తిని పెంచే కొత్త బోధనా పద్ధతులను ప్రవేశపెట్టడంలో ప్రభుత్వం NGOలకు మద్దతు ఇవ్వగలదు ప్రోత్సహించగలదు" అని ఆమె పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు