పూరీకి ఛార్మీ బర్త్ డే విషెస్.. ట్వీట్ వైరల్

బుధవారం, 28 సెప్టెంబరు 2022 (22:22 IST)
Puri Jagannath
దర్శకుడు పూరి జగన్నాధ్ బర్త్‌డే సందర్భంగా సినీనటి ఛార్మి శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియాలో పూరి ఫోటోను షేర్ చేస్తూ 'ఎటర్నల్' అంటూ ఎమోజీని జత చేశారు. లైగర్ ఫ్లాప్ తర్వాత సోషల్ మీడియాకు కొద్ది రోజుల పాటు బ్రేక్ ఇచ్చిన ఛార్మీ.. తాజాగా పూరి బర్త్‌డే సందర్భంగా ఛార్మి ట్వీట్ చేయడంతో వైరలవుతోంది.
 
లైగర్ తర్వాత వెంటనే జనగణమన ప్రాజెక్ట్ ప్రారంభిస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఛార్మి కౌర్, వంశీ పైడిపల్లి, పూరి జగన్నాధ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా ఎంపికైన సంగతి తెలిసిందే.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు