మహేష్ బాబు భరత్ అనే నేను.. ''ఫస్ట్ ఓత్'' వీడియో

శుక్రవారం, 26 జనవరి 2018 (10:09 IST)
టాలీవుడ్ మహేష్‌బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా రూపుదిద్దుకుంటోంది. గణతంత్రదినోత్సవం సందర్భంగా ''ఫస్ట్ ఓథ్'' పేరుతో ఓ ఆడియోను విడుదల చేస్తున్నట్లు కొరటాల ప్రకటించారు. మహేష్ బాబు హీరోగా నటిస్తున్న 'భరత్ అనే నేను'లోని ఓ కీలక డైలాగ్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది.

ఈ చిత్రంలో మహేశ్ బాబు సీఎంగా నటిస్తున్నారు. ప్రమాణ స్వీకారం చేస్తున్న ఆడియోను 'ఫస్ట్ ఓత్' రూపంలో విడుదల చేశారు. ఆ ఆడియో క్లిప్ ను ప్రిన్స్ మహేశ్ స్వయంగా తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్టు చేశారు. 
 
అలాగే ఓ ఫోటోను కూడా భరత్ టీమ్ విడుదల చేసింది. ఓ సభకు భారీగా ప్రజలు హాజరైన ఫొటోపై ''శాసనం ద్వారా నిర్మితమైన.. భారత రాజ్యాంగం పట్ల.. నిజమైన విశ్వాసం.. విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడతానని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతః కరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయంగానీ, పక్షపాతం గానీ, రాగ ద్వేషాలు గానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను'' అనే ప్రమాణ స్వీకార పాఠంతో కూడిన ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు