టాలీవుడ్, కోలీవుడ్లలో క్రేజీ బ్యూటీగా వెలుగుతున్న అందాల తార నయనతార నటిస్తున్న తాజా చిత్రం 'మయూరి'. అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 17న విడుదలవుతోంది. అశ్విన్ శరవణన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని చంద్రకళ, ఉత్తమ విలన్, జ్యోతిలక్ష్మీ వంటి హిట్ చిత్రాలను నిర్మించిన సి. కళ్యాణ్ నిర్మించారు.
థ్రిల్లర్ మూవీ అయినందున విజువల్ ఎఫెక్ట్స్, రీ రికార్డింగ్ చాలా కేర్ తీసుకుని హై స్టాండర్డ్స్లో చేశామన్నారు. ఓ పసిపాప తల్లిగా నయనతార ఈ చిత్రంలో చాలా మంచి క్యారెక్టర్ చేశారన్నారు. నటిగా నయనతారకు ఈ చిత్రం మంచి పేరు తెస్తుందన్నారు. ప్రతి ఒక్కరినీ ఈ సినిమా ఎంటర్-టైన్ చేస్తుందన్నారు.
ఈ సినిమాను దర్శకుడు అశ్విన్ శరవణన్ ఎక్స్లెంట్గా తీశారన్నారు. కాగా ఇందులో ఆది, అంజాద్-ఖాన్, మైమ్ గోపి, లక్ష్మీప్రియ, చంద్రమౌళి, రోబో శంకర్, శరత్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.