రాజమౌళి చేతులమీదుగా 'ఎం.ఎస్‌. ధోని' ఆడియో

గురువారం, 22 సెప్టెంబరు 2016 (15:21 IST)
ప్రముఖ క్రికెటర్‌ ఎం.ఎస్‌. ధోనీ.. జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతోన్న చిత్రం 'ఎం.ఎస్‌. ధోనీ' ద అన్‌టోల్డ్‌ స్టోరీ.. అనేది ఉపశీర్షిక. ఈ చిత్రం తెలుగు ఆడియోను ఈనెల 24న హైదరాబాద్‌లో విడుదల చేస్తున్నారు. ధోనీ, దర్శకుడు రాజమౌళి హాజరుకానున్నారు. చిత్రాన్ని ఫ్యాక్స్‌స్టార్‌ స్టూడియో, అరుణ్‌పాండే సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తయిన హిందీ చిత్రాన్ని ఈనెల 30న విడుదల చేసేందుకు సిద్ధం చేశారు. 
 
అయితే, తమిళం, తెలుగు, మరాఠీ భాషల్లో ఒకేసారి డబ్‌ అవుతున్న ఈ చిత్రానికి నీరజ్‌పాండే దర్శకత్వం వహించారు. మహేంద్రసింగ్‌ ధోనీగా సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుట్‌, సాక్షిసింగ్‌ ధోనిగా కిరన్‌ అద్వానీ, పాన్‌సింగ్‌గా అనుపమ్‌ఖేర్‌ నటించారు. 190 నిముషాల నిడివిగల ఈ చిత్రాన్ని నిర్మించడానికి దాదాపు 80 కోట్ల వెచ్చించారు. మరి సినిమా విడుదలయ్యాక ఎంత మేర ఆదరణ పొందుతుందో చూడాలి. 

వెబ్దునియా పై చదవండి