ఆషాఢం తర్వాత లవర్ బాయ్‌కి వివాహం.. అంతా కరోనా పుణ్యమే

శుక్రవారం, 26 జూన్ 2020 (10:50 IST)
ఆషాఢం తర్వాత లవర్ బాయ్ నితిన్ తను ప్రేమించిన షాలినితో కలిసి ఏడడుగులు వేయనున్నట్లు తెలుస్తోంది. జూలై చివరి వారంలో లేదా ఆగస్టు మొదటి వారంలో నితిన్ షాలినిల వివాహం జరిగే అవకాశం ఉందని టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తుంది. కరోనా విజృంభణ ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. దీంతో నితిన్ పెళ్లిని ఆషాడం పూర్తి అయిన వెంటనే జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం.
 
హైదరాబాద్ శివారులో ఉన్న ఒక ఫామ్ హౌస్‌లో పెళ్లికి సిద్ధం అవుతున్నారు. అతి కొద్ది మంది బంధు మిత్రులను ఈ పెళ్లికి నితిన్ అండ్ ఫ్యామిలీ ఆహ్వానించబోతున్నారు. కాగా.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ నితిన్ తన ప్రేయసి శాలినితో ఏప్రిల్ 16న పెళ్ళి పీటలెక్కాల్సింది. 
 
కాని కరోనా వారి పెళ్లికి బ్రేక్ వేసింది. దుబాయ్‌లో డెస్టినేషన్ మ్యారేజ్ చేసుకోవాలనుకున్న నితిన్ కరోనా వలన తన పెళ్లికి తాత్కాలిక బ్రేక్ వేశాడు. ప్రస్తుతం ఆషాఢం తర్వాత నితిన్ వివాహం చేసుకోవాలని డిసైడ్ అయినట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు