బాలయ్య "పైసా వసూల్‌"కి యూ/ఏ స‌ర్టిఫికెట్.. చార్మీ ట్వీట్

శుక్రవారం, 25 ఆగస్టు 2017 (13:43 IST)
హీరో బాలకృష్ణ, పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పైసా వసూల్. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని రకాల టీజర్లు ఇప్పటికే సోషల్ మీడియాలో సరికొత్త రికార్డును క్రియేట్ చేసి, సరికొత్త రికార్డులను నెలకొల్పాయి.
 
ఈ నేపథ్యంలో.. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు నుంచి యూ/ఏ స‌ర్టిఫికెట్ వ‌చ్చింద‌ని హీరోయిన్ ఛార్మి త‌న ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా తెలిపింది. సెప్టెంబ‌ర్ 1న విడుద‌ల కానున్న ఈ సినిమాకి ఆల్ ది బెస్ట్ చెబుతున్న‌ట్లు పేర్కొంది. 
 
కాగా, ఈ సినిమాలో బాల‌య్య చేసిన ఫైట్స్, డ్యాన్స్ , చెప్పిన డైలాగ్స్‌ను ట్రైల‌ర్ రూపంలో ఇప్ప‌టికే చూపించారు. ఆ ట్రైల‌ర్ ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తోంది. త‌మ అభిమాన హీరో బాల‌య్య సినిమా ప్ర‌మోష‌న్ కోసం సాయ‌ప‌డుతున్న ఛార్మికి అభిమానులు కామెంట్ల రూపంలో కృత‌జ్ఞ‌త‌లు చెబుతున్నారు.  
 
 

#Balakrishna @shriya1109 @purijagan @Charmmeofficial #PaisaVasool Gets U/A Certificate From CBFC, Releasing on September 1st pic.twitter.com/f4QNtWKgPg

— Cinema Mania ️ (@ursniresh) August 24, 2017

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు