ఆ మధ్య కొబ్బరిబొండ, కొబ్బరిమట్ట వంటి పేరుతో టైటిల్స్ వచ్చి అవే కొత్తగా అనిపించేలా చేశాయి. అలాగే తాజాగా పిట్టగోడ అనే టైటిల్తో ఒక చిత్రం రాబోతుంది. ఈ చిత్రాన్ని 'తను నేను' అనే సినిమాను నిర్మించి దర్శకత్వం వహించిన రామ్మోహన్ నిర్మిస్తున్నారు. ఈసారి నేను నిర్మాతగానే వుంటానని తెలియజేశారు. ఈ చిత్రం ద్వారా కొత్తవాడైన అనుదీప్ను దర్శకుడిగా పరిచయం చేస్తున్నాను.
విశ్వదేవ్ రాచకొండ, పునర్మవి హీరోహీరోయిన్లుగా పరిచయమవుతున్నారని తెలిపారు. టెక్నీషియన్స్ కూడా కొత్తవారే వుంటారని తెలియజేశారు. పిట్టగోడకు యూత్ కెరీర్కు సంబంధం వుందని తెలియజెప్పే కాన్సెప్ట్తో రూపొందుతోంది. విశేషం ఏమంటే.. ఈ చిత్ర కథ కూడా హీరోనే చెప్పడం విశేషం. అంతకుముందు ఉయ్యాల జంపాల కథను రాజ్ తరుణే చెప్పాడు. ఆ చిత్రంతో తనే హీరోగా మారాడు.