ఈ నేపథ్యంలో తమిళనాడులో మధురై జిల్లా రజినీకాంత్ అభిమానుల సంఘం సభ్యుడు శేఖర్ మదురైలో అంటించిన పోస్టర్లు కొత్త వివాదానికి దారి తీశాయి. రజనీకాంత్ ఆరోగ్యం దెబ్బతినేందుకు ఆయన సోదరుడే కారణమంటూ శేఖర్ ఆ పోస్టర్లు కొట్టించి.. అక్కడక్కడా అంటించేయడంతో.. రజినీ అభిమానులే ఈ పోస్టర్లపై ఫైర్ అయ్యేలా వ్యవహారం మళ్లింది.
రజినీ సోదరుడు సత్యానారాయణపై శేఖర్ ఆ పోస్టర్లలో దుమ్మెత్తిపోశాడు. రజనీకాంత్ నటించిన కొచ్చాడియన్, లింగా సినిమాలు పరాజయం పాలవడానికి.. రజినీకాంత్ ఆరోగ్యం దెబ్బతినడానికి ఆయన సోదరుడు సత్యనారాయణే కారణమని ఈ పోస్టర్లో విమర్శలు గుప్పించాడు.
అప్పుడు జరిగిన తప్పుకు తాను మధురై మీనాక్షి దేవాలయంలో పరిహారం కూడా చెల్లించనున్నట్లు శేఖర్ వెల్లడించాడు. కానీ సత్యనారాయణపై శేఖర్ విమర్శలు గుప్పించడంతో పాటు.. రజనీ సోదరుడితో శేఖర్ ఏం చెప్పాడు అనే దానిపై కోలీవుడ్లో చర్చ సాగుతోంది. ఇదిలా ఉంటే సత్యనారాయణపై ఆరోపణలు చేసిన శేఖర్పై కేసు నమోదైనట్లు కూడా వార్తలు వస్తున్నాయి.