హత్యకు గురైన అభిమాని వినోద్.. కుటుంబ పరామర్శకు తిరుపతికి పవన్
గురువారం, 25 ఆగస్టు 2016 (10:09 IST)
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గురువారం తిరుపతికి వెళుతున్నారు. కర్ణాటకలోని కోలార్లో హత్యకు గురైన తన అభిమాని వినోద్ కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆయన తిరుపతికి వస్తున్నారు.
సినీ అభిమానుల మధ్య భగ్గుమన్న విభేదాలు కారణంగా వినోద్ కుమార్ (24) ఆదివారం హత్యకు గురైన విషయం తెల్సిందే. కోలారు సమీపంలోని నరసాపురం పారిశ్రామిక వాడలో ఆదివారం రాత్రి ఈ ఘటన జరుగగా, ఆలస్యంగా వెలుగుచూసింది.
వినోద్కుమార్ స్వస్థలం తిరుపతి. వినోద్ హత్య గురించి తెలియడంతో ఆవేదన చెందిన పవన్ ఆయన కుటుంబాన్ని పరామర్శించాలని నిర్ణయించి, గురువారం తిరుపతి వెళ్లి వినోద్ కుటుంబానికి వెళుతున్నారు.