ఆమె వస్తున్నారనీ... మూడు గంటలు రాకపోకలు బంద్... పోలీసుల ఓవరాక్షన్.. ఎక్కడ..?

బుధవారం, 29 జులై 2015 (20:38 IST)
ఆమె వస్తున్నారని పోలీసులు రహదారినే మూసేశారు.. గంటా అరగంటా కాదు. ఏకంగా మూడు గంటలపాటు రాకపోకలను నిలిపేశారు. అదీ ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌ నగరంలోని ఎస్‌.ఆర్‌.నగర్‌ ప్రధాన రహదారిని మూసివేశారు. ఇంతకీ ఎవరామె? 
 
హైదరాబాద్‌లోని ఓ హోటల్‌ ప్రారంభానికి సినీనటి రకుల్‌ ప్రీత్‌సింగ్‌ వస్తోందని పోలీసులు ఏకంగా రహదారిని మూసివేశారు. అత్యంత రద్దీగా ఉండే ఈ రహదారి మూసివేతతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడడ్డారు. ఆమె ఓ ప్రైవేటు కార్యక్రమానికి వస్తే వాహనదారులను ఇబ్బందులు పెడుతూ పోలీసుల ఓవరాక్షన్‌ను సీటీవాసులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి