రాజకీయ నాయకులు తమకు ఓటు వేయండని అడగడానికి.. కూలీపని చేసేవారు, కార్మికులు, కర్షకుల వద్దకు వెళ్ళి.. వారి పనులు చేస్తూ ఫొటోలకు ఫోజులిస్తారు. సరిగ్గా అలాంటిదే... నటీనటులు చేస్తున్నారు. అయితే వారు చేసేదానికి కొంచెం ప్రజాసేవ కూడా వుంది. ఇటీవలే చెన్నై వరదలు, సినీరంగంలోని పేద కళాకారుల కోసం ఏర్పాటు చేసిన ఫండ్ 'మేము సైతం'కు వారంతా కష్టపడుతున్నారు.
మంచు లక్ష్మీ ఆధ్వర్యంలో ఇది నడుస్తోంది. నిన్ననే రానా, అఖిల్లు.. రకుల్ప్రీత్ సింగ్లు.. హైదరాబద్లోని పలు ప్రాంతాల్లో కూరగాయాలు అమ్మేవారిలా, ఆటో డ్రైవర్గా నటించి.. డబ్బు సంపాదించారు. ఇలా ప్రజల్ని చైతన్యం చేసి మరికొందరిని ఆదుకునే ఐడియా బాగుందని.. అయితే వీరిని ఫోటోలు తీసేందుకు యూత్ ఎగబడ్డారు. ఇవి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. సామాన్యుడిని ఆదుకునే తాపత్రయం వీరికి వున్నా... వీరి చేష్టలు.. సినిమాలకు బాగా వుపయోపడుతుందని తెలుస్తోంది.