టాలీవుడ్ అప్ కమింగ్ స్టార్ హీరోయన్ల జాబితాలో ఉన్న రాశి ఖన్నా.. ఈ మధ్య బాగా ఒళ్లు తగ్గించింది. బాగా వర్కౌట్స్ చేసి స్లిమ్ కావడంతో ఈ చిన్నదాన్ని బ్రాండ్ అంబాసిడర్గా ఎంచుకునేందుకు కంపెనీలు క్యూ కట్టేస్తున్నాయి. తాజాదా హైదరాబాద్ కూకట్ పల్లిలో ఓ మాల్ ప్రారంభోత్సవానికి హాజరైన రాశీ ఖన్నాను చూసి అందరూ షాక్ తిన్నారు. ఎప్పుడూ బొద్దుగా ముద్దుగా కనిపించే ఈ భామ.. ప్రస్తుతం పూర్తిగా మారిపోయిన లుక్తో అదరగొట్టేసింది.
బహుశా ప్రస్తుతం పోలీస్ కేరక్టర్ చేస్తున్న ప్రభావం కాబోలు.. బాగానే వర్కవుట్స్ అవీ చేసేసి మొత్తం కరిగించేసింది. సాయిధరం తేజ్ సరసన సుప్రీం మూవీలో పోలీస్ గెటప్ కనిపించనుంది ఈ సుందరి. ఖాకీ డ్రస్కి కొత్త కలరింగ్ ఇవ్వడంతో పాటు.. తను ఆ పాత్రలో ఒదిగిపోయేందుకు బాగానే కష్టపడుతున్నట్లుగా అనిపిస్తోంది. ఇప్పటికైతే రవితేజకి జంటగా నటించిన బెంగాల్ టైగర్ మూవీ రిలీజ్ కోసం రాశిఖన్నా వేయి కనులతో ఎదురుచూస్తోంది.