అలీతో జాలీగా ప్రోగ్రామ్కు ఎంత క్రేజున్న విషయం తెలిసిందే. ఈ ప్రోగ్రామ్కు సెలెబ్రిటీలు వస్తుంటారు. ఈ కోవలో గుంటూరు టాకీస్ మూవీ టీమ్ కూడా వచ్చారు. అందులో డైరెక్టర్ హీరోలతో పాటు హీరోయిన్ రష్మీ కూడా వచ్చింది. జబర్దస్త్ యాంకర్ నుంచి హీరోయిన్ స్థాయికి ఎదిగిన రష్మీ తెలుగులో చాలా వీక్ అని తెలిసి అలీ షాక్ అయ్యాడు.
ఇకపోతే.. రష్మీ గౌతమ్, చరణ్ దీప్ ముఖ్యపాత్రల్లో అంతం అనే సినిమా తెరకెక్కుతోంది. రామ్ గోపాల్ వర్మకు వీరాభిమాని కావడంతో ఆయన దర్శకత్వంలో వచ్చిన అంతం చిత్రాన్నే మా చిత్రానికి టైటిల్గా పెట్టామని దర్శక నిర్మాత జి.ఎస్.ఎస్.పి.కళ్యాణ్ అన్నారు. సస్పెన్స్ థ్రిల్లర్గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో రష్మీ అందచందాలతో పాటు పెర్ పార్మెన్స్కు స్కోప్ ఉన్న పాత్రలో నటించింది.