రవితేజ కిక్ 2 తర్వాత 'ఎవడో ఒకడు' అనే చిత్రం చేయడానికి సిద్ధమయ్యాడు. ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు దిల్ రాజు కార్యాలయంలో ఘనంగా జరిగాయి. దిల్ రాజు కూడా.. సాంప్రదాయ దుస్తులు ధరించి.. హోమం కూడా చేశాడు. అయితే ఆ చిత్రం అనుకున్న సమయానికి సెట్పైకి వెళ్ళలేకపోయింది. ఇందుకు రకరకాల కారణాలున్నాయి. ముఖ్యంగా రవితేజ రెమ్యునరేషన్ విషయంలో ఏకాభిప్రాయం రాలేకపోతున్నట్లు తెలుస్తోంది.