ఆర్.పి. పట్నాయక్ అంటేనే ముందుగా నువ్వునేను వంటి చిత్రాల్లో తేజ దర్శకత్వంలో గాయకుడిగా అందరికీ బాగా తెలుసు. ఆ తర్వాత వారిద్దరి కాంబినేషన్లో పలు చిత్రాలు వచ్చాయి. కానీ ఆపై పట్నాయక్ గాయకుడిగా దూరమయ్యాడు. ఇందుకు నిజం సినిమాలో మహేష్ బాబుకు పాడటమే పెద్ద తప్పు అంటున్నాడు. అయితే.. ఈసారి తేజ కాంబినేషన్లో వచ్చినా పాటలు మాత్రం పాడడని.. సంగీత దర్శకత్వం వహిస్తానని అంటున్నాడు.