సాయిరాం శంకర్ నూతన చిత్రానికి ఇళయరాజా సంగీతం

మంగళవారం, 23 మే 2023 (15:41 IST)
పూరి జగన్నాథ్ తనయుడు సాయిరాం శంకర్ కథానాయకుడిగా విఎన్ఆర్ క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్.1 లాంఛనంగా ప్రారంభమైయింది. పోలవరం బంగారమ్మ అమ్మవారి గుడిలో చిత్ర పూజా కార్యక్రమాలు గ్రాండ్ గా జరిగాయి. ప్రకాష్ జూరెడ్డి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. 90‘s లో జరిగిన యదార్ధ సంఘటన ఆధారంగా విలేజ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని రమణి జూరెడ్డి నిర్మిస్తున్నారు.
 
ముహూర్తం సన్నివేశంలో '' గంగ తలపై ఉన్నంత వరకే శివుడు చల్లగా ఉంటాడు. కంట్లోంచి గానీ జారిందా శివమెత్తుతాడు''అని సాయిరాం శంకర్ చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్ ఆకట్టుకుంది.  
 
మాస్ట్రో ఇళయరాజా ఈ చిత్రానికి సంగీతం అందించడం మేజర్ హైలెట్. అఫీషియల్ గా హైదరాబాద్ లో గ్రాండ్ గా ఓపెనింగ్ నిర్వహించి ఈ చిత్రానికి సంబధించిన మిగతా వివరాలు వెల్లడిస్తామని మేకర్స్ తెలియజేశారు.
 
మధుర వైన్స్, జైత్ర వంటి సినిమాలు పని చేసిన మోహన్ చారి ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ చిత్రానికి పెద్ద వంశీ (డైరెక్టర్) లిరిక్స్ అందించడం మరో విశేషం. అలాగే పుష్ప వంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కి పని చేసిన కార్తీక్ శ్రీనివాస్ ఈ చిత్రానికి ఎడిటర్.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు