వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏదో వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తాడు. ప్రస్తుతం బెజవాడ రౌడీయిజం అంటూ వంగవీటి సినిమాను తీస్తున్న వర్మ.. దాని పబ్లిసిటీ కోసం ఎంత చేయాలో అంతా చేస్తున్నాడు. తాజాగా ఇది తెలుగులో తన చివరి సినిమా అని కూడా ప్రకటన చేశాడు. అయితే వర్మ చెప్పిన ఈ లాస్ట్ ఫిలిం అన్న మాటకు టాలీవుడ్లో కొందరు నవ్వుకున్నారు మరికొందరు పట్టించుకోవడం మానేశారు. కానీ ఎవరూ రిటార్ట్ ఇవ్వలేదు.
అయితే బర్నింగ్ స్టార్ సంపూ మాత్రం వర్మపై చివరి తెలుగు సినిమాపై స్పందించాడు. అంతేకాదు.. వర్మకి వ్యతిరేకంగా ట్వీట్ చేశాడు. అప్పట్లో నాగార్జునతో గోవిందా గోవింద సినిమా తీసినపుడు కూడా వర్మ ఇలాగే శపథాలు చేశాడని గుర్తు చేశాడు. నిజానికి గోవిందా గోవింద సినిమాకి సెన్సార్ విధించిన కట్స్ రిలీజ్ని అడ్డుకోవడం.. వర్మకి బాగా చిరాకు తెప్పించాయి. అందుకే చాలా రోజులు తెలుగు సినిమాలు తీయలేదు. తర్వాత అనగనగా ఒక రోజుతో మళ్లీ టాలీవుడ్లో సినిమాలు మొదలుపెట్టాడు.