మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాపై రోజుకో వార్త పుట్టుకొస్తుంది. ఇప్పటికే తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్గా కన్ఫామ్ అయినట్లు టాలీవుడ్లో జోరుగా ప్రచారం సాగుతోంది. రెండో షెడ్యూల్ చేవెళ్ల ప్రాంతాల్లో జరుగనుంది. ప్రస్తుతానికి సినిమా షూటింగ్ ఆపేసి.. ఏపీ ప్రత్యేక హోదా కోసం కేవీపీ బిల్లుకు ఓటేసేందుకు చిరంజీవి ఢిల్లీ వెళ్ళారు.
ఈ నేపథ్యంలో రెండో షెడ్యూల్ నుంచి హీరోయిన్ ఈ సినిమా షూటింగ్లో జాయిన్ అవుతుందని టాక్ వస్తోంది. కామెడీ ఎంటర్టైనర్గా, గుడ్ స్క్రిప్టుతో రూపుదిద్దుకునే ఈ చిత్రంలో కామెడీకి ప్రియారిటీ ఇవ్వాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఇందులో భాగంగా పలువురు కమెడీయన్స్ని పరిశీలిస్తున్నారు. మొదట సునీల్ని అనుకున్నా ఆ తరువాత వెన్నెల కిషోర్కి ఆ గోల్డెన్ ఛాన్స్ ఇచ్చినట్లు వార్తలొచ్చాయి.