మిథాలీరాజ్ బయోపిక్ పూర్తి.. షూటింగ్ పూర్తి చేసుకున్న తాప్సీ

బుధవారం, 10 నవంబరు 2021 (16:39 IST)
సినీ అభిమానుల మెప్పు పొందిన తాప్సీ పన్ను తాజాగా మిథాలీ రాజ్ బయో పిక్ షూటింగ్ పూర్తి చేసింది. భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీరాజ్ బయోపిక్ ను 'శభాష్‌ మిథు' పేరుతో శ్రీజిత్ ముఖర్జీ తెరకెక్కించాడు.

కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ షెడ్యూల్స్ తారుమారు కావడంతో ఈ మూవీని డైరెక్ట్ చేయాల్సిన రాహుల్ ధోలాకియా ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడంతో శ్రీజిత్ మెగాఫోన్ పట్టుకోవాల్సి వచ్చింది. మంగళవారం ఈ సినిమా షూటింగ్ పూర్తయిన సందర్భంగా తాప్సీ పన్ను హార్ట్ టచింగ్ కామెంట్ ను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. 'ఎనిమిదేళ్ళ వయసులో నాకు ఓ కలను చూపించారు.
 
ఏదో ఒకరోజు క్రికెట్ అనేది కేవలం జంటిల్మన్ ఆట మాత్రమే కాదని చెప్పారు. మనకూ ఓ టీమ్ ఉంటుందని, దానితో ఓ గుర్తింపు లభిస్తుందని తెలిపారు. ఉమెన్ ఇన్ బ్లూ, మేం కూడా త్వరలో మీ ముందుకు వస్తున్నాం. షూటింగ్ పూర్తయ్యింది. వరల్డ్ కప్ 2022ను ఎంజాయ్ చేసేందుకు సిద్ధంగా ఉండండి' అని తాప్సీ అందులో పేర్కొంది. మరి లేడీ క్రికెటర్ మిథాలీ రాజ్ గా తాప్సీ ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు