సిద్ధార్థ్, జీవీ ప్రకాష్ కుమార్ హీరోలుగా 'ఒరేయ్ బామ్మర్ది'

శుక్రవారం, 9 ఏప్రియల్ 2021 (18:09 IST)
Siddhartha
లవర్ బాయ్గా పలు సినిమాలతో మంచి గుర్తింపు దక్కించుకున్న సిద్ధార్థ్, సంగీత దర్శకుడిగా పేరుప్రఖ్యాతలు సంపాదించుకున్న జీవీ ప్రకాష్ కుమార్లు హీరోలుగా బిచ్చగాడు లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన శశి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా  'ఒరేయ్ బామ్మర్ది‌. కశ్మీర పరదేశి, లిజోమోల్ జోస్ లు హీరోయిన్ గా నటిస్తున్నారు..అభిషేక్ ఫిలిమ్స్ పతాకంపై తెరకెక్కిన ఈ యాక్షన్ ఓరియెంటెడ్ సినిమా కి రమేష్ పి పిళ్లై నిర్మాత గా వ్యవహరిస్తున్నాడు.. 
 
కాగా ఈ సినిమాని శ్రీ లక్ష్మి జ్యోతి క్రియేషన్స్ పై ఏ.ఎన్ బాలాజీ ఈ నెలలో తెలుగులో విడుదల చేయనున్నారు. సిద్ధూ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా కి ప్రసన్న కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు. సిద్ధార్థ్, జీవీ ప్రకాష్ కుమార్ ల మధ్య కాంబినేషన్ లో వచ్చే యాక్షన్ చిత్రాలు ఈ చిత్రానికి హైలైట్ గా నిలవనున్నాయి..ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ రాగా తాజాగా ఈ సినిమా టీజర్ గ్లిమ్ప్స్ రిలీజ్ అయ్యింది.
 
ఈ సందర్భంగా చిత్రాన్ని రిలీజ్ చేస్తున్న శ్రీలక్ష్మి జ్యోతి క్రియేషన్స్ ఏ.ఎన్ బాలాజీ మాట్లాడుతూ.. సిద్ధార్థ్, జీవిప్రకాష్ కుమారులు నటించిన ఈయాక్షన్ సినిమాని తెలుగులో రిలీజ్ చేయడం ఎంతో ఆనందంగా ఉంది. సినిమా కిమంచి రెస్పాన్స్ వస్తుందన్న నమ్మకం ఉంది.ఇద్దరు హీరోలు పోటాపోటీగా సినిమా లో నటించారు. ఫస్ట్ లుక్కి మంచి రెస్పాన్స్ వచ్చింది.. టీజర్ కూడా అందరికి నచ్చుతుందని ఆశిస్తున్నాను అన్నారు.. 
 
ఎడిటింగ్ : సాన్ లోకేష్ 
సినిమాటోగ్రఫీ : ప్రసన్న కుమార్
సంగీతం : సిద్ధూ కుమార్
బ్యానర్ : అభిషేక్ ఫిలిమ్స్
సమర్పణ : రమేష్ పి పిళ్లై
నిర్మాత : రమేష్ పి పిళ్లై
దర్శకుడు : శశి
రిలీజ్ బై :  శ్రీ లక్ష్మి జ్యోతి క్రియేషన్స్ -  ఏ.ఎన్ బాలాజీ 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు