ఆపదలో వున్నవారికి ఆపద్భాంధవుడు.. సోనూసూద్ కొత్త స్కీమ్!

సోమవారం, 15 ఫిబ్రవరి 2021 (19:48 IST)
బాలీవుడ్ స్టార్ యాక్టర్ సోనూ సూద్ ప్రస్తుతం ఆపదలో వున్నవారికి ఆపద్భాంధవుడిగా నిలిచాడు. లాక్ డౌన్‌లో ఆయన ఎంత మందిని ఆదుకున్నారో.. ఎంత మందికి సహాయం చేశారో అందరం చూస్తూనే ఉన్నాం. లాక్ డౌన్‌లో మాత్రమే కాకుండా ఆయన ఇప్పటికీ కూడా అవసరమైన వారికి సాయం చేస్తూనే వస్తున్నారు. సోనూ సూద్ ఇప్పుడు కొత్తగా స్కీమ్ తీసుకువస్తున్నారు. 
 
నిరుద్యోగ యువతకు దీని వల్ల చాలా బెనిఫిట్ కలుగనుంది. మీ వద్ద డబ్బులు లేకపోయినాసరే మీరు మీ సొంత బిజినెస్‌ను స్టార్ట్ చేయొచ్చు. మీరు యజమానిగా మారొచ్చు. ఇది ఎలా? అని ఆలోచిస్తున్నారా? అయితే సోనూ సూద్ చేసిన ట్వీట్ చదవాల్సిందే. 
 
సోనూ సూద్ ట్విట్టర్‌లో ఒక ఫోట్ షేర్ చేశారు. దీనికి సిద్ధంగా ఉండండి అనే ఒక క్యాప్షన్ పెట్టారు. జీరో ఇన్వెస్ట్‌మెంట్‌తో అంటే ఇన్వెస్ట్‌మెంట్ లేకుండానే సొంతంగా వ్యాపారం చేయొచ్చు. ఈ స్కీమ్ ద్వారా గ్రామాల్లో యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో సోనూ సూద్ ముందుకు వెళ్తున్నారు. ఈ స్కీమ్ ద్వారా అనేకమంది ప్రజలు ప్రయోజనం పొందే అవకాశం వుందని టాక్ వస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు