ఈ విషయం తెలుసుకున్న సిమ్రన్ ఓ ప్రొడక్షన్ హౌజ్ ప్రారంభించింది. తాజాగా త్రిష ఇల్లెన్నా నయనతారలో చేసిన క్యారెక్టర్కి మంచి స్పందన రావడంతో హీరోయిన్గా కెరీర్ను కంటిన్యూ చేయాలని నిర్ణయించింది. తన సొంత బ్యానర్లో భర్తనే ప్రొడ్యూసర్గా చేసి ఓ పోలీస్ స్టోరీ చేసేస్తోంది. అన్నట్లు బుల్లితెరపై కూడా ఓ డ్యాన్స్ రియాల్టీ షోకి జడ్జ్గా వ్యవహరించింది. అక్కడ కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే వచ్చింది.
గ్లామర్ రోల్స్తో పెట్టుకోకుండా, లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్తో ప్రేక్షకులను కట్టిపడేయాలని సిమ్రన్ చూస్తోంది. హిందీలో తాజా రిలీజైన మర్దాని టైప్లో ఓ మాంచి స్టోరీ లైన్ని గౌరీ శంకర్ అనే డైరక్టప్ వినిచూపించాడట. గతంలో కమర్షియల్ యాడ్స్ చేసిన ఇతగాడు సిమ్రన్ రీఎంట్రీతో దర్శకుడిగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు.