వాడు రోడ్డు మీద పంది... టాలీవుడ్ హీరోయిన్లను మరుగుదొడ్లలా? శ్రీరెడ్డి

గురువారం, 19 జులై 2018 (14:35 IST)
శ్రీరెడ్డి కోలీవుడ్ ఇండస్ట్రీలో హల్చల్ చేస్తోంది. ఛానళ్లను వదిలేసిన శ్రీరెడ్డి ఇప్పుడు యూ ట్యూబ్ నిర్వహించే వెబ్ సైట్లను పట్టుకుని అడిగినవారికి అడిగినట్లు ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ వెళ్తోంది. తమిళ ఇండస్ట్రీలోని కొందరు పేర్లు చెప్పి సంచనలనం సృష్టించిన శ్రీరెడ్డి మళ్లీ తెలుగు హీరోలపైన కూడా టార్గెట్ పెట్టింది. ఓ జాతీయ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇస్తూ... టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోలందరూ హీరోయిన్లను తమ మరుగుగొడ్లలా ఉపయోగించుకుంటున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యలపై టాలీవుడ్ హీరోయిన్లు ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలి.
 
అదలావుంచితే... ఫేస్ బుక్కులో... ఒరేయ్ సూరిగా అంటూ ఎవర్నో ఉద్దేశించి దారుణమైన పదజాలం ఉపయోగించి తిట్టిపోసింది. రోడ్డు మీద పోయే పంది... అనీ... ఇంకా రాయలేని పదాలను వాడేసింది. మరి ఆ సూరి అనే అతను టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందినవాడా లేదంటే ఫేస్ బుక్కులో శ్రీరెడ్డిని టార్గెట్ చేస్తున్న నెటిజనా తెలియాల్సి వుంది. మొత్తమ్మీద శ్రీరెడ్డి చేస్తున్న హంగామా అటు తెలుగు ఇటు తమిళ సినీ ఇండస్ట్రీల్లో సంచలనంగా మారుతున్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు