అమ్మాయిలే ఎక్కువ ఫాలో అవుతున్నారు... : మహేష్ బాబు బావ సుధీర్ బాబు
మంగళవారం, 3 మే 2016 (20:40 IST)
ఇంటగెలిచి రచ్చ కూడా గెలిచిన నటుడు సుధీర్బాబు. మహేష్ బాబు బావ అయిన సుధీర్ బాబు తెలుగులో 'ఏమాయ చేసావే' చిత్రంతో విలన్గా ఎంట్రీ ఇచ్చి హీరోగా మారాడు సుధీర్ బాబు. అలానే హిందీలో కూడా 'బాఘీ' అనే చిత్రం ద్వారా విలన్గా పరిచయమయ్యాడు. ఈ సినిమాకు జాతీయ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా సుధీర్ బాబు పాత్రకు విమర్శకుల ప్రసంశలు లభిస్తున్నాయి. ఈ సందర్భంగా సుధీర్ బాబు విలేకర్లతో ముచ్చటించారు.
మొదటిసారిగా బాలీవుడ్ సినిమాలో నటించాను. తెలుగులో నేను ఎంట్రీ ఇచ్చింది విలన్గానే. హిందీలో కూడా అలానే ఎంట్రీ ఇచ్చాను. సినిమాకు మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. నేను నటించిన 'ఎస్ఎంఎస్' సినిమాలో చేసిన కొన్ని స్టంట్స్ యు ట్యూబ్లో పోస్ట్ చేశాను. అవి చూసి 'బాఘి' సినిమా ఆడిషన్స్కు రమ్మని పిలిచారు. ఏదో చిన్న పాత్ర కోసం పిలిచారనుకొని.. నో చెప్పాలనుకున్నాను. కాని కథ వినగానే బాగా నచ్చింది.
మన 'వర్షం' సినిమాకు సిమిలారిటీస్ వుంటాయి. నేను బాలీవుడ్లో నటించడంపై నెగెటివ్ కామెంట్స్ ఎక్కువగా వినిపించాయి. కాని సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన తరువాత అందరికీ బాగా నచ్చింది. యుట్యూబ్ లో 12 వేల వ్యూస్ వచ్చాయి. అలానే సినిమా ప్రివ్యూ చూసి బాలీవుడ్ క్రిటిక్ తరన్ ఆదర్శ్ ఫోన్ చేసి అభినందించారు. డైలాగ్స్ లేని చోట కూడా కళ్ళతో మంచి అభినయాన్ని కనబరిచావని చెప్పారు. హీరోయిన్ శ్రద్ధా కపూర్ వాళ్ళ ఫాదర్ కూడా ఫోన్ చేసి బాగా నటించానని, బాలీవుడ్లో మంచి ఆఫర్స్ వస్తాయని చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే హిందీలో చాలా ఆఫర్స్ వస్తున్నాయి.
కాని మంచి సినిమాలు సెలెక్ట్ చేసుకొని నటించాలనుకుంటున్నాను. హీరోగానే నటించాలని డిమాండ్ పెట్టుకోకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న ఏ పాత్రలో అయినా నటించాలని భావిస్తున్నాను. తెలుగులో కూడా విలన్ పాత్రల్లో నటించడానికి సిద్ధంగా ఉన్నాను. విలన్ రోల్స్లో నటిస్తే లేడీ ఫ్యాన్స్ తగ్గిపోతారనుకున్నాను కానీ 'బాఘీ' సినిమా చూసి ట్విట్టర్లో, ఫేస్ బుక్లో ఎక్కువ మంది అమ్మాయిలే మెసేజ్లు చేస్తున్నారు. నేను సొంతంగానే నిర్ణయాలు తీసుకుంటాను. చుట్టూ ఉండే వారి సలహాలు తీసుకున్నా.. ఫైనల్ నిర్ణయం నాదే.
ప్రస్తుతం పుల్లెల గోపీచంద్ బయోపిక్లో నటించడానికి ప్లాన్ చేస్తున్నాను. పెద్ద పెద్ద బ్యానర్స్ ఆ సినిమాను నిర్మించడానికి ముందుకొస్తున్నారు. బేసిక్గా నేను బ్యాట్మింటన్ ప్లేయర్ను కాబట్టి ఆ పాత్ర కోసం పెద్దగా కష్టపడక్కర్లేదు. పుల్లెల గోపీచంద్ను నేను దగ్గర నుండి చూశాను. తను ఫేస్ చేసిన స్ట్రగుల్స్ నాకు తెలుసు. ఆ సినిమాను తెలుగు, హిందీ భాషల్లో రూపొందించాలనుకుంటున్నాం. అయితే ఈ సినిమాకు ముందు ఒక తెలుగు సినిమాలో నటిస్తున్నాను. 'భలే మంచి రోజు' సినిమాకు కో-డైరెక్టర్గా పని చేసిన శ్రీరాం రెడ్డి కథ చెప్పారు. బాగా నచ్చింది. ఈ నెలాఖరున సినిమా షూటింగ్ ఉంటుంది'' అని చెప్పారు.