దేవిశ్రీప్రసాద్ సుకుమార్ చేతిలో పడ్డాడు.. హీరో అయిపోయాడు..! మరి హీరోయిన్?

శనివారం, 28 నవంబరు 2015 (13:19 IST)
ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ హీరో అయిపోయాడు. దిల్ రాజు నిర్మాణంలో, సుకుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న సినిమాలో హీరోగా నటించనున్నాడు. ఈ విషయాన్ని దిల్ రాజు కూడా ధ్రువీకరించాడు. ఈ సినిమాకి రత్నవేలును సినిమాటోగ్రాఫర్‌గా ఎంపిక చేసినట్లు కూడా దిల్ రాజు తెలిపాడు. మంచి కథ దొరకడంతో హీరోగా నటించేందుకు దేవి శ్రీ ప్రసాద్ ఓకే చెప్పేశాడని తెలిసింది.
 
ఇకపోతే.. దేవి శ్రీ ప్రసాద్ హీరో అయితే హీరోయిన్‌గా ఎవరు నటిస్తారు అనే దానిపై ప్రస్తుతం ఫిలిమ్ నగర్ వర్గాల్లో చర్చ సాగుతోంది. అందాల ఛార్మీ దేవికి సరసన నటించే అవకాశమూ లేకపోలేదని సినీ జనం అనుకుంటున్నారు. ఇప్పటికే జ్యోతిలక్ష్మి ఆశించిన స్థాయిలో గుర్తింపు సాధించిపెట్టకపోవడంతో.. దేవి సినిమాలో నటించైనా ఛార్మీ ఓ మంచి హిట్ కొట్టేస్తుందేమోనని సినీ పండితులు అభిప్రాయపడుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి