ప్రస్తుతం నడిగర్ సంఘానికి అధ్యక్షుడిగా ఉన్న ప్రముఖ నటుడు శరత్ కుమార్ మరోమారు ఆ పదవిని ఆశిస్తున్నారు. ఈ క్రమంలో శరత్ కుమార్పై పలు ఆరోపణలు చేసిన యువ హీరో విశాల్ ఆయనకు పోటీగా నడిగర్ అధ్యక్ష బరిలో దిగేందుకు రెడీ అయ్యాడు. దీనిపై ఇరు వర్గాల మధ్య ఘాటు విమర్శలతో పాటు వ్యక్తిగత విమర్శలు సైతం తూటాల్లా పేలుతున్నాయి.