తమిళంలో ధనుష్కి యూత్లోనూ.. మాస్లోను మంచి ఫాలోయింగ్ వుంది. అలాంటి పండుగను ఈ ఏడాది వాళ్లు మూడోసారి జరుపుకోవడానికి సిద్ధపడుతూ వుండటం విశేషం. ఈ ఏడాది మొదట్లో ధనుష్ 'అనేగన్' సినిమా చేశాడు.
ఒక విభిన్నమైన కథాంశంగా ఈ సినిమా ఆయన అభిమానులకి నచ్చింది. ఆ తర్వాత నటించిన 'మారి' ప్రేక్షకుల ఆదరణ పొందింది. ఇక తాజా చిత్రం తంగమగన్ వచ్చేనెల 18న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ధనుష్ సరసన సమంతా- అమీ జాక్సన్ కథానాయికలుగా నటించిన ఈ సినిమాకి వేల్ రాజ్ దర్శకత్వం వహించాడు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన వి.ఐ.పి. చిత్రం అక్కడ అనూహ్యమైన విజయాన్ని సాధించింది. ఆ సినిమాకి సీక్వెలే 'తంగమగన్' అని తెలుస్తోంది.