వీటిపై ఇన్నాళ్లు స్పందించకుండా మిన్నకున్న అనుష్క శర్మ తాజాగా స్పందించారు. సోషల్ మీడియా వేదికగా చేసుకుని తనపై విమర్శలు గుప్పిస్తోన్న వారంతా స్త్రీ ద్వేషులు అని అభివర్ణించింది. విజయవంతంగా ఎవరిపై ఆధారపడకుండా బాధ్యతలు నిర్వహిస్తోన్న మహిళలను చూస్తే నెటిజన్ల ఈగో హర్ట్ అవుతుంది అని ఆమె పేర్కొంది. నెటిజన్లు తనకు సంబంధంలేని విషయంపై తనపై కామెంట్లు చేస్తూ, విమర్శలు గుప్పించడమేంటని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది.