డ్రగ్స్ కేసు... చార్మీకి దడ పుడుతోందా? హైకోర్టును ఆశ్రయించిన నటి...

సోమవారం, 24 జులై 2017 (12:17 IST)
టాలీవుడ్ ఇండస్ట్రీలో డ్రగ్స్ కేసు దడ పుట్టిస్తోంది. ఇప్పటికే పూరీ జగన్నాథ్, శ్యామ్ కె నాయుడు, సుబ్బరాజు, తరుణ్‌లను విచారించిన సిట్ ఇవాళ మరో నటుడు నవదీప్‌ను విచారిస్తోంది. నవదీప్ విచారణ సుదీర్ఘంగా కొనసాగే అవకాశాలు వున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలావుంటే చార్మిని ఈ వారంలోనే విచారించనున్నారు. ఈ నేపధ్యంలో చార్మి హైకోర్టును ఆశ్రయించారు.
 
డ్రగ్స్ కేసు విచారణ తీరు సరిగా లేదనీ, బ్లడ్ శాంపిల్స్ తీసుకోవడం అభ్యంతరకరం అంటూ పిటీషన్ వేశారు. ఈ పిటీషన్ ఈరోజు మధ్యాహ్నం విచారణకు వచ్చే అవకాశం వున్నట్లు సమాచారం. మరోవైపు ఈ నెల 26న చార్మి సిట్ ఎదుట విచారణ ఎదుర్కోవలసి వుంది. ఈ నేపధ్యంలో చార్మీ పిటీషన్ ప్రాధాన్యతను సంతరించుకుంది. మొత్తమ్మీద డ్రగ్స్ కేసు వ్యవహారం సెలబ్రిటీలకు దడ పుట్టించేదిగా వుంటుందనే టాక్ వినబడుతోంది.

వెబ్దునియా పై చదవండి