తన అక్క, చెల్లి వివాహాలు జరిపి తాను కూడా జీవితంలో స్థిరపడాలనుకుంటున్నంతలోనే విధి అతన్ని జల సమాధి రూపంలో కాటేసింది. మరో విలన అనిల్కు వివాహమై ఇద్దరు బిడ్డలున్నారు. వీరిద్దరి అకాల మృతితో ఆధారం కోల్పోయిన వీరి కుటుంబాలు దిక్కులు పిక్కటిల్లేలా హృదయ విదారకరంగా రోదిస్తున్నాయి.
అయితే, ఈ విషాదకర సంఘటన జరగడం వెనుక నిజాలు వెలుగు చూస్తున్నాయి. తమకు ఈత రాదు మొర్రో అని మొత్తుకుంటున్నా స్టంట్ డైరెక్టర్ రవి వర్మ వీరిద్దరితో సహజత్వం కోసం ఎలాంటి ముందుజాగ్రత్త చర్యలు చేపట్టకుండానే సన్నివేశాలను చిత్రీకరించారు. ఫలితంగానే ఇద్దరు గొప్ప విలన్లు ప్రాణాలు కోల్పోయారు.